TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.4.45 కోట్లు

Published on: Thu Aug 21, 2025 9:14AM

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం భక్త జనసందోహంతో కిటకిటలాడుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు తిరమల శ్రీవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు.

గురువారం (ఆగస్టు 21) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో  పాతిక కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (ఆగస్టు 20) శ్రీవారిని మొత్తం 75 వేల 688 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 99 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 45 లక్షల రూపాయలు వచ్చింది.