TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Sun Jan 5, 2025 8:00AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం (జనవరి 5)ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు. టోకేన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక శనివారం (జనవరి 4) శ్రీవారిని మొత్తం 71 వేల 990 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 205 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ 26లక్షల రూపాయలు వచ్చింది.