తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Wed Jan 1, 2025 8:35AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కొత్త సంవత్సరం సందర్భంగా బుధవారం (జనవరి 1) తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 8 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
టోకేన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది. ఇక మంగళవారం(డిసెంబర్ 31) శ్రీవారిని 62,495 మంది దర్శించుకున్నారు. వారిలో 19,298 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. టిటిడి హుండీ ఆదాయం 3 కోట్ల 8లక్షల రూపాయలు వచ్చింది.


