TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Mon Nov 4, 2024 7:45AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (నవంబర్ 4) తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు 26 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.

ఇక ఆదివారం (నవంబర్ 3) శ్రీవారిని మొత్తం 84 వేల 489 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 971 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 76లక్షల రూపాయలు వచ్చింది.