తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Published on: Sat Oct 12, 2024 9:17AM
.webp)
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (అక్టోబర్ 12)శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 12 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (అక్టోబర్ 11) శ్రీవారిని మొత్తం 71వేల443 మంది దర్శించుకున్నారు. వారిలో 26వేల948 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 52లక్షల రూపాయలు వచ్చింది.


