తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Thu Sep 19, 2024 9:34AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (సెప్టెంబర్ 19)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక బుధవారం(సెప్టెంబర్ 18) శ్రీవారిని మొత్తం 78 వేల 690 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 86 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 18 లక్షల రూపాయలు వచ్చింది.


