తిరుమల శ్రీవారి హుండీ ఆదాయవం 4.33 కోట్ల రూపాయలు
Published on: Fri Jul 7, 2023 7:37AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది. గురువారం శ్రీవారిని 66 వేల977 మంది భక్తులు దర్శించుకున్నారు. 33, 020 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం 4.39 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ వచ్చింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.


