తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు
Published on: Tue May 16, 2023 7:04AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం 70 వేల 366 మంది తిరమల శ్రీవారిని దర్శించుకున్నారు. 38వేల 653 మంది తలనీలాలు సమర్పించారు.
శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు కోట్ల 32 లక్షల రూపాయలు వచ్చింది. ఇక మంగళవారం ఉదయం నుంచే తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.
శిలా తోరణం వరకూ భక్తులు క్యూలో నిలుచుని ఉన్నారు. టోకేన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనం చేసుకోవడానికి దాదాపు 24 గంటలకు పైగా సమయం పడుతోంది.


