తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Sun Jun 18, 2023 8:32AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం(జూన్17) 87, 762 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 43వేల 753 మంది తలనీలాలు సమర్పించారు.
శ్రీవారి హుండీ ఆదాయం 3.61 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.


