శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
Published on: Wed Jun 14, 2023 7:03AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
బుధవారం ( జూన్ 14) ఉదయం శ్రీవారి సర్వదర్శనం కోసం ఎదురు చూస్తన్న భక్తులతో 27 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
ఇక మంగళవారం (జూన్ 13) శ్రీవారిని 75వేల 227 మంది దర్శించుకున్నారు. 33. 706 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయలు వచ్చింది.


