శ్రీవారి హుండీ ఆదాయం 4.41 కోట్లు
Published on: Tue Jun 13, 2023 9:47AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం(జూన్ 12) శ్రీవారిని 79వేల 87 మంది దర్శించుకున్నారు.
35వేల640 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక మంగళవారం (జూన్ 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో మొత్తం 31 కంపార్ట్ మెంట్లూ నిండిపోయాయి.
టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.


