తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ
Published on: Mon Jun 19, 2023 9:22AM
తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఆదివారం నాడు శ్రీవారిని 86వేల 181 మంది భక్తులు దర్శించుకున్నారు. 30వేల 654 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
హుండీ ఆదాయం 4.59 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.


