తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Tue Jun 6, 2023 9:30AM
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
శ్రీవారి సర్వదర్శనం కోసం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం (జూన్ 5) 79,974 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
37,052 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. వేంకటేశ్వరుని హుండీఆదాయం రూ.3.77 కోట్లు వచ్చింది.


