శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Published on: Fri Jun 16, 2023 7:56AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి సర్వ దర్శనానికి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది.
గురువారం(జూన్15) శ్రీవారిని 70వేల896 మంది దర్శించుకున్నారు. 37వేల 546 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.07 కోట్ల రూపాయలు వచ్చింది.
ఇక శుక్రవారం(జూన్16) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు క్యూలైన్ లో నిలిచి ఉన్నారు.


