తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.02 కోట్లు
Published on: Mon Jun 12, 2023 10:17AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం (జూన్ 12) ఉదయం మొత్తం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20గంటలకు పైగా సమయం పడుతోంది. ఆదివారం స్వామివారిని 92, 238 మంది భక్తులు దర్శించుకున్నారు.
40 వేల 400 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.02 కోట్ల రూపాయలు వచ్చింది.


