పవన్ కళ్యాణ్‌కు అందుకే కోపమొచ్చింది

 

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా బీజేపీ, పవన్, జగన్ ల మీద విమర్శలు చేసారు.. బీజేపీ, ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా మాట తప్పింది.. అందుకే టీడీపీ, ఎన్డీయే నుండి బయటికొచ్చేసింది అన్నారు.. మేం ఎన్డీయే నుండి బయటికి రావడంతో పవన్ కళ్యాణ్ కు కోపమొచ్చింది, అందుకే ఇప్పుడు రోడ్డెక్కారు అన్నారు..అలానే జగన్ బీజేపీతో కుమ్మక్కై కావాలనే చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తున్నారు అన్నారు.. ఈ వయస్సులో చంద్రబాబు కష్టపడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే పవన్,జగన్ ఇద్దరూ తట్టుకోలేకపోతున్నారని ఉమా మండిపడ్డారు.