మోడీ పని అయిపోయినట్టే...


ఎన్డీయే నుండి టీడీపీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక దీనిపై స్పందించిన మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ మోడీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గమైన హసన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్రమోదీ హవా రోజురోజుకు కుంచించుకుపోతోందని.. ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావడంతో మోదీ ప్రాభవానికి ఇక బీటలు వారినట్టేనన్నారు. ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో మోదీ వెనక్కి తగ్గారని విమర్శించారు. విభజన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి టీడీపీతో బీజేపీ జతకట్టిందని, ఇప్పుడు మోదీ యూటర్న్ తీసుకున్నారు... ఏపీ హామీల విషయంలో మోదీ యూటర్న్ తీసుకోవడం ద్వారా జాతీయస్థాయిలో కొత్త కూటములకు అవకాశం ఇచ్చినట్టు అయిందని దేవెగౌడ అభిప్రాయపడ్డారు.