తెలంగాణ సీఈఓ ఆఫీస్ కి భారత డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్
Published on: Fri Aug 5, 2022 7:04PM

భారత డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ శ్రీ నితీష్ కుమార్ వ్యాస్ శుక్రవారం నాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ)తో ఈ క్రింది అంశాలపై చర్చలు జరిపారు.
1. ఆధార్తో ఓటరు కార్డు అనుసంధానం
2. ఓటరు నమోదు ఫారమ్ల సవరణ
3. తదుపరి కార్యక్రమాల కోసం సంసిద్ధత
తెలంగాణ రాష్ట్రంలో PSE తొలగింపులో అనుసరించిన ప్రక్రియ గురించి కూడా చర్చించారు.
ఆగస్ట్ 1, 2022 న ప్రారంభమైన ఆధార్తో ఓటరు కార్డు అనుసంధానం ఏప్రిల్ 2023 వరకు కొనసాగుతుందని వారు చర్చించారు.
ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ కూడా హాజరయ్యారు.


