కొత్త వెయ్యి నోటు ఇదేనా..?

దేశంలో పెద్ద ఎత్తున పోగుబడుతున్న నల్లధనాన్ని అరికట్టడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసే చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ రూ.1000, రూ.500 వంటి పెద్ద నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.2000, కొత్త రూ.500 నోటును చలామణిలోకి తీసుకువచ్చారు. అయితే రద్దయిన వెయ్యినోటును కూడా మళ్లీ ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది. కొత్త సిరీస్ వెయ్యినోటును ప్రవేశపెట్టడానికి ఆర్‌బీఐ, కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రద్దయిన పాత నోట్ల లోటును భర్తీ చేయడానికే కొత్తగా రూ.1000 నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. నిజానికి గత జనవరిలోనే కొత్త వెయ్యి నోట్లను ప్రవేశపెట్టాలని భావించినా..రూ.500 నోట్లను ఎక్కువగా చలామణిలోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ఆర్‌బీఐ వాటిపై ఎక్కువ దృష్టిసారించింది.