చెట్టుకున్న కల్లుకుండను చూసే జనం ఊగిపోతున్నారట!
posted on Apr 5, 2020 11:29AM
లాక్డౌన్తో కల్లు దుకాణాలు కూడా బంద్ అయ్యాయి. సమయానికి గొంతులో కల్లు పడకపోవడంతో కల్లుతాగే కొందరికి చుక్కలు కనపడుతున్నాయి. దీంతో జనాలంతా పొలాలకు, తాటి చెట్ల దగ్గరకు క్యూ కడుతున్నారు. విషయం చెట్టు దగ్గరే తేల్చుకోవడానికి మందుబాబులు గుమ్మిగూడారు. చెట్టకు ఒక కుండ వుంది. కానీ చెట్టు చుట్టూ జనం చేరారు. కుండ కల్లు ఎంత మందికి కిక్కు ఇస్తుంది. అయినా జనం ఎగబడటంతో చెట్టు దిగకుండా కల్లు తీసే అతను చెట్టు పైనే నిలబడ్డాడు. అయితే కింద వున్న జనం కల్లు తాగకుండానే కుండను చూస్తూ ఊగిపోయారు.
కల్లు కంపౌడ్ తెరుచుకోవడం లేదు. చెట్టు దగ్గర చుక్క దొరకడం లేదని మందుబాబులు తెగ ఇబ్బందిపడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కునే పనిలో పడ్డారు. మత్తుకు అలవాటు పడిన వీరు తమకు తోచిన రీతిలో మందు కోసం తంటాలు పడుతున్నారట. చెప్పుకుంటే సిగ్గు పోతుంది.. చెప్పకుంటే ప్రాణం పోతుంది అన్నట్లుగా పల్లెల్లో పరిస్థితి వుంది.