TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండియాలో రీప్యాకింగ్ దందా.. అమెరికా, దుబాయ్ నుంచి ఎక్స్ పైర్ అయిన సరుకు.!

Published on: Fri Jul 17, 2026 9:59AM

మార్కెట్లో లభించే విదేశీ బ్రాండ్ల చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ విషయంలో జరుగుతున్న భారీ నకిలీ దందా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు.  అమెరికా, దుబాయ్ వంటి దేశాల నుండి గడువు ముగిసిన (ఎక్స్ పైర్ అయిన) ఆహార పదార్థాలను తక్కువ ధరకు తెప్పించి, వాటిపై కొత్త తయారీ తేదీలను ముద్రించి మార్కెట్లో విక్రయిస్తున్న  ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

ఈ ముఠాకు సూత్రధారి అయిన 54 ఏళ్ల అటల్ జైస్వాల్ తో పాటు అతని ఆరుగురు సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇండియాలో  ఇంపోర్టెడ్ ఫుడ్ వ్యాపారం పేరిట వీరు ఈ భారీ మోసానికి తెరలేపారు.  పోలీసుల కథనం ప్రకారం..  అటల్ జైస్వాల్,  అతని గ్యాంగ్ అమెరికా, దుబాయ్ లలోని కొన్ని ఏజెన్సీలతో చేతులు కలిపి . అక్కడ ఎక్స్ పైరీ డేట్ ముగిసిన  అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తులను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిపై కొత్త ఎక్స్ పైరీ డేట్లు ముద్రించి విక్రయించేవారు. 

ప్రధానంగా ఓరియో బిస్కెట్లు, కేకులు, కోకోకోలా వంటి విదేశీ పానియాలు, అలాగే విదేశీ బ్రండ్ల చాక్లెట్లు, స్నాక్స్ ను కంటైనర్ల ద్వారా ఇండియాకు రప్పించి, వాటి ఎక్స్ పైరీ డేట్ తేదీలను మార్చి మార్కెట్లోకి పంపేవారు. ఈ ముఠ.. తమ రహస్య గోడౌన్లలో  గడువు ముగిసిన తేదీలను కెమికల్స్ ఉపయోగించి పూర్తిగా చెరిపేసేవారు. ఆపై అత్యాధునిక ప్రింటింగ్ మిషన్ల ద్వారా ఆ ప్యాకెట్లపై   త్త ఎక్స్‌పైరీ తేదీలను, మ్యానుఫ్యాక్చరింగ్ తేదీలను ముద్రించేవారు. ఇలా రీ ప్యాకింగ్ చేసిన నకిలీ, ఆరోగ్యానికి హానికరమైన విదేశీ ఆహార పదార్థాలను దేశంలోని ప్రముఖ సూపర్ మార్కెట్లు, ఆన్‌లైన్ గ్రాసరీ స్టోర్లు, విదేశీ వస్తువులు అమ్మే ప్రీమియం షాపులకు విక్రయించి కోట్ల రూపాయలు ఆర్జించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వీరి గోడౌన్ల పై మెరుపు దాడులు నిర్వహించారు.  ఈ దాడుల్లో లక్షలాది రూపాయల విలువైన గడువు ముగిసిన ఓరియో బిస్కెట్లు, విదేశీ కోకాకోలా బాటిళ్లు, చాక్లెట్లతో పాటు డేట్లు మార్చేందుకు ఉపయోగించే కెమికల్స్, ప్రింటింగ్ డైలు, ప్యాకేజింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. 

  Imported food scam, Expired food racket, Atal Jaiswal arrest, Fake expiry date scam, Re-packaging fraud