ఢిల్లీలో హైఅలర్ట్.. పొంచి ఉన్న ఉగ్రముప్పు

 

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. రెండు రోజుల్లో జరగనున్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రదాడులు జరిగే ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు హెచ్చరించడంతో హైఅలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా చెక్ పోస్టుల దగ్గర వాహనాలను, ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.