ఢిల్లీలో ప్రభుత్వం.. బీజేపీకి ఆహ్వానం?

 

ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అత్యధిక మెజారిటీ వున్న పార్టీగా భారతీయ జనతాపార్టీకి గవర్నర్ జనరల్ నుంచి ఆహ్వానం లభించే అవకాశాలు లభిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ 49 రోజులకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అప్పటి నుంచి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన వుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడానికి అనుమతి కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. రాష్ట్రపతి ఆ లేఖను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో ఐదుగురు సభ్యుల మద్దతు అవసరం. ఆ మద్దతును బీజేపీ ఎలా సాధిస్తుందనేది ఆసక్తికరం.