ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పరిస్థితి విషమం.. కరోనాకు తోడు డెంగ్యూ

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న సిసోడియాకు కరోనా సోకగా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే ఆయనకు జ్వరం తగ్గకపోవడంతో పాటు, రక్తంలో ఆక్సీజెన్ లెవెల్స్ పడిపోవడంతో మూడు రోజుల క్రితం లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్ (ఎల్ఎన్‌జేపీ) ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయనకు తాజాగా డెంగ్యూ కూడా సోకడంతో అటు జ్వరం తగ్గకపోగా.. బ్లడ్ ప్లేట్‌లెట్లు కూడా క్రమంగా పడిపోతుండడంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆయనను లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్ ఆసుపత్రి నుంచి సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించినట్టుగా అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆయనను ఐసియులో ఉంచి చికిత్స చేస్తున్నారు.