ఢిల్లీలో పేలుడు... ఒకరు మృతి

 

దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు సంభవించింది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని స్థానిక చాందినీ చౌక్‌ ప్రాంతంలో పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడులో ఒకరు మృతిచెందగా.. కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పేలుడికి గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.