బెడ్‌రూమ్‌లో శవం...

 

హైదరాబాద్‌లో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. ఆజంపురా ప్రాంతంలో మహ్మద్ ఖాలేద్ అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి మూడు రోజుల క్రితం వేరే ఊరికి వెళ్ళాడు. ఆ కుటుంబం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు బద్దలు కొట్టి వున్నాయి. ఇంట్లో దొంగతనం జరిగి వుంటుందని భావించి బెడ్ రూమ్ దగ్గరకి వెళ్ళి తలుపు నెట్టగా తెరుచుకోలేదు. కిటీకీలోంచి చూస్తే సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకుని వున్న వ్యక్తి శవం కనిపించింది. ఊహించని ఈ పరిణామానికి బెంబేలెత్తిపోయిన ఖాలీద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎవరో స్థానికులు ఎవరికీ తెలియదు. పరాయి వాళ్ళ ఇంటికి తలుపులు బద్దలు కొట్టి లోపలకి వెళ్ళి, వాళ్ళ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైనా అలా హత్య చేశారా... ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రస్తుతం ఎవరి దగ్గరా లేవు.