టన్నెల్ లో డెడ్ బాడీలు దొరికాయి
Published on: Sat Mar 1, 2025 3:27PM
ఎస్ఎల్ బిసి లో టన్నెల్ కూలి ఎనిమిదిమంది ఆచూకీ గత వారం రోజుల నుంచి కనిపించడం లేదు. శనివారం అనూహ్యంగా ఈ ఎనిమిది మంది విగత జీవులుగా కనిపించారు. టన్నెల్ బోర్ మెషీన్ క్రింది భాగంలో బురదలో వీరు కూరుకుపోయినట్టు అధికారులు గుర్తించారు. పూర్తిగా డీ కంపోజ్ అయిన స్థితిలో శవాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు అప్పగించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం టన్నెల్ మిషన్ కట్ చేసే పనిలో ఉన్నారు. కట్ చేసిన తర్వాతే శవాలను బయటకు తీయడానికి వీలుంటుంది. టన్నెల్ లో డీవాటరింగ్ చేస్తేనే బురద బయటకు తీసే అవకాశముంది


