వైసీపీలోకి ఆనం.. ముహూర్తం ఖరారు

 

ఆనం రామానారాయణరెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరబోతున్న సంగతి తెలిసిందే.. ఈ వార్త గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది.. ఇప్పటికే ఆనం, జగన్ ను కలిసి వైసీపీలో చేరిక గురించి మాట్లాడారు కూడా.. అయితే అసలు ఆనం వైసీపీలో ఎప్పుడు చేరతారు? అనే క్లారిటీ లేక ఇప్పటికీ ఈ విషయంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.. కానీ తాజా సమాచారం ప్రకారం ఆనం వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది.. ఈనెల 13వ తేదిన విశాఖపట్నంలో జగన్‌ పర్యటన ఉంది.. ఆ రోజు విశాఖలో నిర్వహించే బహిరంగ సభలో జగన్‌ సమక్షంలో ఆనం వైసీపీలో చేరబోతున్నట్టు సమాచారం.