పురంధేశ్వరి సీఎం కలలు

 

 Daggubati Purandeswari, telangana, samaikyandhra, kiran kumar reddy, lagadapati

 

 

రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర కు ముఖ్యమంత్రి కావాలని పురంధేశ్వరి కలలు కంటున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపించారు. విభజనపై దగ్గుబాటి దంపతులు శకుని పాత్ర పోషిస్తున్నారన్నారు. సీఎం పదవి కోసం పురంధేశ్వరి కొత్త స్వరం వినిపిస్తున్నారని, దగ్గుబాటి దంపతుల మాటలు నమ్మేందుకు సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరని ఉమా అన్నారు. ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి తెచ్చి సమ్మె విరమింపజేయాలని సీఎం కిరణ్ కుట్ర పన్నారని, సోనియా డైరెక్షన్‌లోనే సీఎం పనిచేస్తున్నారని ఆరోపించారు. రాజీనామాల విషయంలో ఎంపీ లగడపాటి డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. ప్రధానికిచ్చిన బ్లూప్రింట్‌ను పురంధేశ్వరి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు దద్దమ్మలని, రాష్ట్రాన్ని నాశనం చేశారని ఉమా వ్యాఖ్యానించారు.