రిషీకేశ్ టీటీడీ ఆలయంలో దోపిడీ దొంగలు.. గార్డు హత్య...
posted on Aug 5, 2014 10:05AM
ఉత్తరాఖండ్లోని రిషీకేశ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వేంకటేశ్వర ఆలయంలో సోమవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలు ఆలయంలో దోపిడీకి ప్రయత్నించినప్పుడు సెక్యూరిటీ విధుల్లో వున్న గార్డు వారిని ప్రతిఘటించాడు. దాంతో ఆ దోపిడీ దొంగలు సెక్యూరిటీ గార్డును హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆలయంలో ఎలాంటి దోపిడీ జరగనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రిషీకేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిషీకేశ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దొంగలు వేంకటేశ్వర ఆలయంలో చోరీకి ప్రయత్నించారు. రిషీకేశ్ ఆలయంలో దోపిడి దొంగల బీభత్సం గురించి తెలుసుకున్న టీటీడీ అధికారులు రిషీకేశ్కి బయల్దేరారు.