డీఎస్ కొడుకుపై నిర్భయ కేసు..!!

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. తెలంగాణ సీనియర్ నేత డీఎస్ ను కష్టాలు ఒకదాని తరువాత ఒకటి చుట్టుముడుతున్నాయి.. మొన్నటికి మొన్న సొంత పార్టీ నేతలు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేసీఆర్ లేఖ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆయన కుమారుడు సంజయ్ మీద ఏకంగా నిర్భయ కేసు నమోదైంది.

 

 

సంజయ్ కు చెందిన శాంకరీ కాలేజీలోని విద్యార్థినిలు కొంత మంది..  హైదరాబాద్ లో హోంతమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి తమపై సంజయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.. వెంటనే హోం మంత్రి డీజీపీ మమేందర్ రెడ్డికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. డీజీపీ నిజామాబాద్ సీపీకి రిఫర్ చేశారు.. ఆ విద్యార్థినులు నిజామాబాద్ సీపీని కూడా కలిసి ఫిర్యాదు చేశారు.. వారి ఫిర్యాదు మేరకు సంజయ్ పై నిర్భయ కేసు నమోదు చేశారు.. అయితే సంజయ్ మాత్రం..  శాంకరీ కాలేజీకి తనకు సంబంధం లేదన్నారు.. కొన్నేళ్ల క్రితమే, తాను కాలేజీని వేరేవారి లీజుకిచ్చానని చెప్పారు.. రాజకీయ కారణాలతోనే తనను టార్గెట్ చేస్తున్నారని, పోలీసుల విచారణకు సహకరిస్తానని అన్నారు.. మరోవైపు సంజయ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్తే, ఆయన ఇంట్లో లేరని తెలుస్తోంది.. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.