టీఆర్ఎస్ నేత ఇంట్లో గంజాయి పెట్టమన్న కాంగ్రెస్ మాజీ మంత్రి..?

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శ్రీధర్ బాబు బెదిరింపుల కేసులో ఇరుక్కున్నారు.. తనను శ్రీధర్ బాబు గంజాయి కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సర్సంచ్‌ను కేసులో ఇరికించే ప్రయత్నంలో భాగంగా సుదర్శన్ అనే సర్పంచ్‌ని కిషన్ రెడ్డి ఇంట్లో గంజాయి పెట్టిరమ్మంటున్నట్లుగా శ్రీధర్ బాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఆ టేపులు మీడియాకు చిక్కడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేశామని ప్రకటించారు. అయితే ఈ ఆరోపణలపై శ్రీధర్ బాబు స్పందించలేదు.