TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖలో చోటుచేసుకున్న అతి దారుణ ఆత్మహత్య ప్రయత్నం

Published on: Sat Oct 12, 2019 12:10PM

 

విశాఖలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్య కోసం ఏకంగా గ్యాస్ సిలిండర్ ను ఉపయోగించింది. సిలిండర్ పేలి ముగ్గురు మరణించడం ఒకరికి తీవ్ర గాయాలు అవడంతో మొదట అది ప్రమాదమనుకున్నారు. కాని కాదు ఓ కుటుంబం గ్యాస్ సిలిండర్ పైప్ ను కట్ చేసి ప్రమాదాన్ని సృష్టించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇదే ఇప్పుడు కీలకాంశం.విశాఖ నగరంలోని సాగర్ నగర్ గుడ్లవాని పాలెంలో జరిగింది ఈ  ఘటన. హెచ్ఐజీ 101 ఫ్లాట్ లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ఉమామహేశ్వరరావు, కుమార్తె లావణ్య, కొడుకు సతీష్ చంద్ర అద్దెకుంటున్నారు. ఇరుగుపొరుగుతో పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు.అర్ధరాత్రి సడెన్ గా గ్యాస్ సిలెండర్ పేలడం తో హుటాహుటిన ఫైర్ సేఫ్టీని పిలిపించారు. అప్పటికే లావణ్య చనిపోయింది. కొన ఊపిరితో ఉన్న సతీష్ చంద్రను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.ఇక ఉమామహేశ్వరరావు చికిత్స పొందుతూ చనిపోయాడు.గ్యాస్ పేలినప్పుడు సౌండ్ వంద మీటర్ ల వరకూ వినిపించింది. అద్దాలు పగిలి ఎగిరిపడ్డాయి. పొరుగిళ్ల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి.పిల్లలు ఇద్దరు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అయితే గత ఉమామహేశ్వర రావ్ కొంత కాలంగా  డిప్రెషన్ లో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఎందుకు వారి కుటుంబం ఇంత దారుణానికి పాలైందో తెలియక ఇరుగు పొరుగు అయోమయంలో ఉన్నారు. ఒక్కసారీగా ఇంత పెద్ద ఎత్తున ఎగిసిపడిన భారీ మంటలకు మరియు భారీగా వచ్చిన శబ్దాలకు పక్కన ఇళ్ళ వస్తువులు,అద్దాలు,కిటీకీలు కూడా ధ్వంశం అవ్వడం చూసి అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యారు.ఇక పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగులో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.