సైకిల్ బాంబు పేలి 12 మందికి తీవ్ర గాయాలు

 

పాకిస్థాన్‌లోని జిన్నా పట్టణంలో సుమంగళి హౌసింగ్ సొసైటీ సమీపంలో శనివారం అర్థరాత్రి శక్తిమంతమైన సైకిల్ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సుమంగళి హౌసింగ్ సొసైటీ సమీపంలోని హోటల్ వద్ద శక్తిమంతమైన సైకిల్ బాంబును, టైమర్ అమర్చారని తెలుస్తోంది. బాంబు పేలుడు సంభవించిన సమయంలో హోటల్ సమీపంలో జనాభా చాలా తక్కువగా వుండటంతో తక్కువమంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల దాటికి సమీపంలోని భవనాలు, ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి.