TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పుష్కరఘాట్ లో మొసలి!!!

Published on: Thu Jul 16, 2015 4:23PM

 

కరీంనగర్ జిల్లాలో ఇబ్రహీం మండలం వేములకుర్తి వద్ద బాలమ్మ పుష్కర ఘాట్ లో స్నానాలు చేస్తున్న భక్తులకి నీళ్ళలో మొసలి కనిపించడంతో తుళ్ళిపడి భయంతో ఒడ్డుకి పరుగులు తీసారు. ఈ విషయం తెలుసుకొన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మొసలిని పట్టుకొన్నారు. ఒడ్డుకి వచ్చిన మొసలి చాలా చిన్నది కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మళ్ళీ కాసేపు విరామం తరువాత భక్తులు యధావిధిగా నదిలోకి దిగి స్నానాలు చేయడం మొదలుపెట్టారు. నదిలో ఒక మొసలి కనబడిందంటే లోన ఇంకా మొసళ్ళు ఉండే అవకాశం ఉంది. ఈరోజు భక్తుల అదృష్టం కొద్దీ సకాలంలో మొసలిని చూసి ప్రాణాలు రక్షించుకోగలిగారు. కానీ మళ్ళీ మరొక మొసలి రాదని నమ్మకం ఏమిటి? కనుక ప్రభుత్వం అక్కడ పుష్కర స్నానాలు నిషేధించి ఉంటే బాగుండేది. ప్రమాదం జరిగిన తరువాత బాధపడటం కంటే జరగకుండా ముందే జాగ్రత్త పడితే మంచిది కదా?