నేడు భారత్ - వెస్టిండీస్ ఢీ

 

ప్రపంచ కప్ క్రికెట్‌లో భాగంగా శుక్రవారం నాడు పెర్త్‌లో జరిగే మ్యాచ్‌లో ఇండియా - వెస్టిండీస్ పోరాటం చేయనున్నాయి. ఈ మ్యాచ్ లో నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, యూఏఈ జట్లను మట్టికరిపించిన వెస్టిండీస్‌ని దెబ్బతీయాలన్న పట్టుదలతో ఉంది. మూడు వరుస విజయాలతో దూసుకుపోతున్న ధోని సేన తన జోరును కొనసాగించాలని ఆశిస్తోంది. కాకపోతే అరివీర భయంకరుడు క్రిస్ గేల్‌కి కళ్ళెం వేయడం తప్పనిసరి. అతను మరోసారి రెచ్చిపోతే మాత్రం ఇండియా గెలవటం కష్టమేనని క్రికెట్ పండితులు అంటున్నారు. అయితే భారత జట్టుతోపాటు భారతీయులందరూ ఇండియా తప్పకుండా గెలుస్తుందని భావిస్తున్నారు.