కొత్త రాజధాని విశాఖలో మరో ప్రమాదం.. 10 మంది మృతి

ఏపీకి కొత్తగా అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ గా నిర్ణయించిన విశాఖలో తాజాగా మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్ యార్డ్ లో కొద్ది సేపటి క్రితం మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది కూలీలు వరకు మృతి చెందినట్టు సమాచారం. అక్కడ ఒక క్రేన్ ను తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా దాని కిందనే పని చేస్తున్న కూలీల పైన పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే మూడు మృత దేహాలను గుర్తించగా మరి కొంత మంది క్రేన్ కింద చిక్కుకున్నారని అని తెలుస్తుంది.

అయితే ఈ దుర్ఘటనకు గల కారణాలపై ఇంకా పూర్తీ సమాచారం అందవలసి ఉంది. ఈ ఘటన పై షిప్ యార్డ్ యాజమాన్యం స్పందించలేదు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విశాఖ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకున్నారు అని తెలుస్తుంది.