జగన్ కు చాడా కితాబు
Published on: Tue May 1, 2012 10:14AM
సిపీఐ రాష్ట్ర కార్యదశివర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వచ్చే ఉపఎన్నికల్లో జగన్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవటం ఖాయమంటున్నారు. జగన్ పార్టీ సభ్యులకు స్వచ్చందంగానే వేలాదిమంది ప్రజలు హాజరుకావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆయన అంటున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో పలుమార్పులు సంభవిస్తాయని ఆయన జోస్యం చెప్పారు.
మీరు ఏ ఉద్దేశ్యంతో జగన్ ను పొగుడుతున్నారని విలేఖరులు ప్రశ్నించినప్పుడు తానేవరినీ అనవసరంగా పొగడటం లేదనీ, ఉన్న విషయాన్నే చెబుతున్నాననీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతోనే ఉపఎన్నికలు వచ్చాయనీ, ఈ ఉపఎన్నికల్లో తమ పార్టీ టిడిపికి మద్దతు ఇస్తున్నామనీ తెలిపారు. ఉపఎన్నికల పొత్తు కూడా తాత్కాలికమేనని ఆయన అంటున్నారు. అయితే చాడా వెంకటరెడ్డి జగన్ కు అనుకూలంగా మాట్లాడటం పట్ల కొందరు సిపీఐ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


