ఆశ్రమంతో చీకటి డీల్! ఆ బీజేపీ నేతలేనా?

ఎపి బీజేపీకి చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు చిత్తూర్ జిల్లాకు చెందిన ఒక ఆశ్రమంపై జరిగిన ఐటి, ఇడి దాడులలో బయటపడ్డ వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల కేసును తాము ఢిల్లీ స్థాయిలో డీల్ చేసి సెటిల్ చేస్తామని చెప్పి 30 కోట్లు దండుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై ఎపి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖలు చేసారు. ఆ ఆశ్రమంతో డీల్ చేసుకుని 30 కోట్లు దండుకున్నది బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, జివిఎల్ నరసింహారావులే అని తెలుస్తోందని రామకృష్ణ అనంతపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో తెలిపారు. ఏపీలో ప్రజలంతా ఆ పేర్లే చెప్పుకుంటున్నారని.. తాజాగా వస్తున్న ఆరోపణలపై కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు క్లారిటీ ఇవ్వాలని అయన డిమాండ్ చేసారు. క్లారిటీ ఇవ్వాల్సిన బీజేపీ నేతలు తెలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని అయన విమర్సియించారు. మా పార్టీకి చెందిన ఆ ఇద్దరు నేతలు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని బీజేపీ నాయకత్వం స్పష్టమైన ప్రకటన చేయాలనీ అయన డిమాండ్ చేసారు అంతేకాకుండా ఆ ఇద్దరు నేతలు ఈ డీల్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే వారిపైన చర్యలు టీయూకోవాలని రామకృష్ణ డిమాండ్ చేసారు. నిత్యం హిందూ మతం అనే బీజేపీ నేతలు దొంగ స్వాములు కోట్లు కూడబెట్టుకుంటే ఈ దొంగ హిందూ భక్తులు మిలాఖత్ అవుతున్నారని అయన అన్నారు. సిపిఐ నేత రామకృష్ణ చేసిన ఈ సంచలన ఆరోపణలపై బీజేపీ నాయకత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.