ఫిరాయింపు ఎమ్మెల్యేల కంటే రెడ్ లైట్ ఏరియా వాళ్లే నయం!!

 

తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంపై సీపీఐ నేత నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు. ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించినా రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని నారాయణ స్పష్టం చేశారు. కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కారణంగా రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి పోతోందని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల కంటే ముంబై రెడ్ లైట్ ఏరియా వాళ్లే నయం అని విమర్శించారు. టీఆర్ఎస్ లో ఉంటేనే నిధులు ఇస్తామని ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులకు కేసీఆర్ చెబుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ లో చేరడం తప్ప మరో మార్గం లేకపోతే ఇక ఎన్నికలు ఎందుకు? అని నారాయణ ప్రశ్నించారు.