కరెంటు అడిగితేనే లాఠీలతో కొడతారా? ఇదెక్కడి న్యాయం...

 

తెలంగాణ రైతులు కరెంటు కావాలని అడిగినందుకే అన్యాయంగా వాళ్ళని లాఠీలతో గొడ్డును బాదినట్టు బాదిస్తారా అని సీపీఐ నాయకుడు నారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమైన విషయమని, సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మతోన్మాదులకు భయపడుతున్నట్లు తెలుస్తోందని నారాయణ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆయన కోరారు.