భారత్‌లో కొత్తగా 6,654 కరోనా కేసులు

భారత్ లో మొన్నటివరకు రోజుకి ఐదు వేలకు పైగా నమోదైన కరోనా కేసులు.. ఇప్పుడు రోజుకి ఆరు వేలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా, ఒక్కరోజులో అత్యధికంగా 6500 కు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 6,654 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ తెలిపింది. అదే సమయంలో 137 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో, దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,720కి చేరింది. ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,25,101కి చేరింది. కాగా, ప్రస్తుతం 69,597 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.