ఏపీలో మళ్ళీ 60 కి పైగా కరోనా కేసులు.. ఒకరు మృతి

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సగటున రోజుకి 50 కేసులకు పైగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 8,415 శాంపిల్స్ ను పరీక్షించగా 62 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 51 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికవరకు నమోదైన మొత్తం కరోనా కేసులు సంఖ్య 2,514 కి చేరింది. ఇప్పటివరకు 1,734 మంది డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 728 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 55కి చేరింది.