దంపతుల దారుణ హత్య

 

దోపిడి దొంగలు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన తిలావరపు రాములు (65), మల్లమ్మ (60) అనే దంపతులు గురువారం ఉదయం తమ ఇంట్లో నిద్రిస్తూ వుండగా దుండగులు ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో దంపతుల మీద దాడిచేసి దారుణంగా చంపారు. సంఘటన స్థలంలో రక్తసిక్తమైన గొడ్డలి పడి వుంది. చడీచప్పుడు లేకుండా జరిగిన ఈ సంఘటన గురువారం తెల్లవారు ఝాము తర్వాత గానీ వెలుగులోకి రాలేదు. దంపతులను చంపిన తర్వాత దుండగులు ఇంటిని దోచుకుని వెళ్ళిపోయారు.