దంపతులను కాటేసిన కరెంటు తీగలు!

 

కరెంటు తీగలు ముచ్చటైన జంటను కాటేసి పొట్టన పెట్టుకున్నాయి. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరిపాలెంలో ఈ విషాదకర సంఘటన జరిగింది. శనివారం ఉదయం ఐదుగంటలకు నిద్ర లేచిన వెంకటేశ్వరమ్మ అనే మహిళ తమ ఇంటిముందు విద్యుత్ స్తంభానికి చెందిన విద్యుత్ తీగలు తెగి పడి వుండటాన్ని గమనించి వాటిని పక్కకి తొలగించే ప్రయత్నం చేసింది. దాంతో కరెంట్ షాక్‌కి గురై ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత ఇంట్లోంచి బయటకి వచ్చిన ఆమె భర్త విఘ్నేష్ ఇంటి ఎదురుగా భార్య చనిపోయి పడి వుండటాన్ని చూసి కంగారుపడిపోయి భార్యని పట్టుకున్నాడు. దాంతో అతను కూడా తీవ్ర విద్యుదాఘాతానికి గురై అతను కూడా అక్కడికక్కడే మరణించాడు.