కరోనా విజృంభణ.. భారత్ లో పెరుగుతున్న మరణాలు

భారత్‌లో ప్రతిరోజు కరోనా వైరస్ కేసులు 6,500 పైగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా వందకి పైగా సంభవిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 6,535 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో కరోనాతో 146 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,380 కి చేరగా, మృతుల సంఖ్య 4,167కి చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకు 60,490 మంది కోలుకోగా, ప్రస్తుతం 80,722 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.