ఏపీ సెక్రటేరియట్ లో కరోనా కలకలం

దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా ఇది అమరావతి లోని ఏపీ సెక్రటేరియట్ లోకి కూడా ఎంటర్ అయింది. లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులు ఎంప్లాయిస్ ఇంటర్ సిటీ ట్రైన్ లో ప్రయాణించి విధులకు హాజరయ్యేవారు. ఐతే దాదాపు రెండు నెలలుగా లాక్ డౌన్ వల్ల హైదరాబాద్ లో చిక్కుకు పోయిన ఉద్యోగులు విధులకు హాజరు కాలేక పోయారు. దీంతో వీరి కోసం ఏపీ ప్రభుత్వం గత బుధవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల నుండి ఏపీకి కొన్ని ప్రత్యేక బస్సులు నడిపింది. ఇపుడు ఆలా ప్రత్యేక బస్సులో మంగళగిరికి చేర్చి అక్కడ వారి నుండి కరోనా టెస్టుల కోసం సాంపిల్స్ తీసుకొని వారి తాత్కాలిక నివాసాలకు పంపించారు. ఐతే తాజాగా ఆ టెస్టులలో వ్యవసాయ శాఖలో పనిచేసే ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతని తో కలిసి తిరిగిన వ్యక్తులతో పాటు అతని తో పాటు అదే బస్సులో ప్రయాణించిన ఉద్యోగులందరు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది.