తెలంగాణాలో 229 పాజిటివ్ కేసులు, ఈ రోజు ఇద్ద‌రు మృతి!

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఆందోళ‌న‌క‌రంగా పెరుగుతూనే వుంది. ఈ రోజు ఇద్ద‌రు మృతి చెందారు. ఒక‌రు షాద్‌న‌గ‌ర్‌కు చెందిన వారు కాగా మ‌రొక‌రు సికింద్రాబాద్‌కు చెందిన‌వారు.

కొత్త‌గా 75 మందికి ఈ రోజు పాజిటివ్ వ‌చ్చింది. దీంతో తెలంగాణాలో పాజిటివ్ వ‌చ్చిన వారి సంఖ్య 229కి పెరిగింది. ఢిల్లీ మ‌ర్క‌జ్ నుంచి వ‌చ్చిన వారంద‌రినీ గుర్తించారు. వారిలో ల‌క్ష‌ణాలు వున్న వారి కుటుంబ స‌భ్యుల‌ను ఐసోలేష‌న్ సెంట‌ర్స్‌కి త‌ర‌లించి క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌మ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఆరు ల్యాబ్‌ల‌లో 24 గంట‌లు మూడు షిఫ్టుల్లో క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.