భారత్‌లో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి

భారత్ లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకి ఆరువేలకు పైగా నమోదవుతున్న కేసులు.. ఇప్పుడు ఏడు వేల మార్కుని దాటాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 7,466 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. భారత్‌లో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే, కరోనా మరణాల సంఖ్య కూడా పెరిగింది. 24 గంటల్లో 175 మంది కరోనాతో మరణించారు. భారత్ లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,65,799కి చేరగా, మృతుల సంఖ్య 4706కు చేరింది. కరోనా సోకిన వారిలో ఇప్పటివరకూ 71,105 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 89,987 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.