భారత్‌ లో ఒక్కరోజులో 30 వేలకు పైగా కరోనా కేసులు

భారత్‌ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 32,695 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. భారత్‌ లో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 606 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,68,876కి చేరగా, మరణాల సంఖ్య 24,915కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 6,12,815 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 3,31,146 యాక్టివ్ కేసులు ఉన్నాయి.